అంతా , అందరూ రక్తంతో ఏకమై పోయారు . సృష్టి అంతమొందేవరకు వరదలై మానవ రక్తం ప్రవహిస్తూ అందర్నీ బంధించి , ఏకం చేసిన మృత్యువుకి అతీతమై పోతుంది . అదే కాబోలు అమరత్వం అంటే .
దేన్ని ధ్యానం చేస్తే అది ఐపోతావని హిందూ ఫిలాసఫీ చెపుతోంది . భక్తుడు ప్రార్థన వల్ల దైవత్వం పొందుతాడు.
మంచివాళ్ళు తమకి తెలీకుండా హానిచేస్తారు .
అనుకోవడానికి , ఆచరించడానికి మధ్య చాలా దూరముంది . ఒక పర్వత శిఖరం మీదనుంచి , మరో దేశంలో వున్నా పర్వత శిఖరం మీదకు దూకడం లాంటిది ..
పరిపూర్ణ జ్ఞానంతో విముఖత పొందిన అమాయకత్వం కొందరిది .
తమ గుణాలని ఇతురులలో చూడడం మానవ నైజం . తమకిష్టమైన వాళ్ళందరూ మంచివాళ్ళు , ఇష్టం లేని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ..
మనుషుల శీలాన్ని బట్టి గుణాలని బట్టి మనము ఆదరించాలని పెద్దలు చెపుతారు . కానీ నిజంగా మనం చూసేది ఇది కాదు . మనుషుల వాలకం , వైఖరి యివే యిష్టాలు నిర్ణయించేవి .
NRB
No comments:
Post a Comment